end

అమరావతిలో తన బినామీలు

తిరుపతి: అమరావతిలో తన బినామీలు కొనుగోలు చేసిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆస్తులపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మంగళవారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడిన మిథున్‌రెడ్డి.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పునరుద్ఘాటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడం హాస్యాస్పదమని, దమ్ముంటే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరారు.

Exit mobile version