end

భవనం కూలి 18 మంది మృతి

  • ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లో ఘటన

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌ శ్మశానవాటి కాంప్లెక్స్‌ భవనం కూలి 18 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టారు. ఈ దురదృష్ట ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.

Exit mobile version