end

దేశంలో కొత్తగా 44,281 కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 44, 281 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, కేసుల సంఖ్య 86,36,012కి చేరింది. ఇందులో 4,94,657 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 80,13,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 512 మంది కరోనా బారిన పడి మరణించగా, ఆ సంఖ్య 1,27,571కి చేరింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 11.53లక్షల మందికి కోవిద్ టెస్టులు చేయగా.. ఇప్పటివరకు టెస్టుల సంఖ్య 12,07,69,151కి చేరుకుంది.

Exit mobile version