సూపర్ స్టార్(Super star) మహేశ్ బాబు(Mahesh Babu)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate)(ఈడీ) షాక్ ఇచ్చింది. సాయిసూర్య డెవలపర్స్(Sai surya developers), సురానా ప్రాజెక్టు(Surana project) కంపెనీలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందున ఆయనకు అందిన పారితోషికంలో ఏమైనా మనీ ల్యాండరింగ్ జరిగిందా? అన్న కోణంలో విచారణ చేపట్టనున్నది. మహేష్ ఈ నెల 27న ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ మనీల్యాండరింగ్ కేసులు నమోదు చేసింది.
ఆ రెండు కంపెనీల నుంచి పారితోషికంగా రూ. 5.9 కోట్లు తీసుకున్నారని, దీనిలో రూ. 3.4 కోట్లు చెక్ రూపంలో.. మరో రూ.2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారని సమాచారం. ఈ లావాదేవీలపై ఈడీకి అనుమానాలు ఉన్నట్లు తెలిసింది.