ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్.బి.ఐ గృహ రుణ గ్రహీతలకు ఊరటనిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) మార్పు కాలపరిమితిని ఏడాది నుంచి 6 నెలలకు తగ్గించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఎంసీఎల్ఆర్లో వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనం కోసం రుణ గ్రహీతలు ఇక ఏడాది వరకు వేచి చూడక్కర్లేదని ట్వీట్లో పేర్కొన్నది.
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం…
రేపో రేటు ఇతర మార్కెట్ ఆధారిత ప్రామాణికాలపై రుణాలను తీసుకోకుండా ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలను తీసుకున్నవారికి ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు త్వరగా అందడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ నిర్ణయం రుణాల మంజూరుకు ఊతమివ్వగలదన్న అంచనాలూ వినిపిస్తున్నాయి.