end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంచెరువులో మునిగి చిన్నారులు మృతి
- Advertisment -

చెరువులో మునిగి చిన్నారులు మృతి

- Advertisment -
- Advertisment -
  • మనోహరాబాద్‌ మండలంలో విషాధం

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు

చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందిన విషాధకర సంఘటన మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం దండుపల్లి పంచాయతీ పిట్టలవాడలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. పిట్టలవాడకు చెందిన అఖిల(6), రవి (6), నవీన్‌(5) సహా మరో ఇద్దరు పిల్లలు సమీప చెరువు వద్ద ఆడుకోవడానికి వెళ్లారు. రాళ్లను చెరువులో విసురుకుంటూ ఆడుకున్నారు. ఈ క్రమంలో నవీన్‌, అఖిల, రవి ఆడుకుంటూ ఆడుకుంటూ చెరువులో దిగి నీటిలో మునిగిపోయారు.

జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు

దీంతో అక్కడే ఉన్న మరో ఇద్దరు పిల్లలు భయంతో ఇళ్లకు పరుగెత్తి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు రోధిస్తూ చెరువు వద్దకు చేరుకోగానే అప్పటికే చిన్నారులు మృతి చెంది నీటిలో తేలియాడుతూ కనిపించారు. దీంతో గ్రామంలో విషాధం నెలకొంది. గ్రామ ప్రజలు అక్కడికి చేరుకొని హృదయవిదారక సంఘటన చూసి తల్లడిల్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ఆసుపత్రికి తరలించారు.

ఏపీలో ప్రత్యేక రైల్వే సర్వీసులు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -