end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంకరోనా వైరస్‌తో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి
- Advertisment -

కరోనా వైరస్‌తో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

- Advertisment -
- Advertisment -

కరోనా వైరస్‌ బారిన పడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌ సీపీ నేత ద్రోణం రాజు శ్రీనివాస్‌ మృతి చెందారు. ఆయనకు ఈ మధ్య కరోనా వైరస్‌ సోకి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే వ్యాధి తీవ్రత పెరిగి ఊపిరితిత్తులోకి వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారింది. ఆదివారం సాయంత్రం ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఎస్‌బిఐ ఏటీఎం ధ్వంసం… రూ.11.55 లక్షలు చోరీ

అయితే ప్రజల సందర్శనార్ధం పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాత్సవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన విశా ఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా ఉన్నారు.

జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షా ఫలితాలు…

సీనియర్‌నేత, మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడైన శ్రీనివాస్‌.. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. శ్రీనివాస్‌కు భార్య శశి, కుమార్తె శ్వేత, కు మారుడు శ్రీవాస్తవ ఉన్నారు. ద్రో ణంరాజు మృతికి ఏపీ సీఎం జగన్‌తోపాటు పలువు రు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు.

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -