end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంవిద్యుత్‌షాక్‌తో కుటుంబ సభ్యులు దుర్మరణం
- Advertisment -

విద్యుత్‌షాక్‌తో కుటుంబ సభ్యులు దుర్మరణం

- Advertisment -
- Advertisment -
  • ఇంటి గేటుపై తెగిపడిన 11 కె.వి విద్యుత్‌ వైర్లు
  • నెల్లూరు జిల్లా కల్లూరులో పెను విషాదం

విద్యుత్‌ షాక్‌ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందిన దుర్ఘటన నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి సంభవించింది. వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా కల్లూరు పల్లిలోని హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీకి చెందిన టీచర్‌ వేణుగోపాల్‌ ఇంటి ప్రధాన గేటుపై 11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దురదృష్టావశాత్తు దీన్ని గమనించకుండా గేటు తీసిన వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో R.C.B విజయం

అయితే భర్తను రక్షిద్దామని ఏం ఆలోచించకుండా వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బజ్జమ్మ(70) వేణుగోపాల్‌ చేయి పట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత చెందడంతో కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

తెలంగాణలో వర్ష భీభత్సం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -