- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నగదు అందజేత
నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్
భారీ వర్షాలతో తెలంగాణలోని అన్ని జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం పరిస్థితి మరీ దారుణంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కాలనీ వాసులు నిరాశ్రులయ్యారు. తినడానికి తిండలేక అలమటిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఆదుకుటుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఖైరతాబాద్లోని ఎంఎస్ మక్తా, రాజునగర్లలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు
వరద బాధితులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్క రూ.10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఎల్లప్పుడు ప్రజల సేవలోనే ఉంటారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇండ్లు కోల్పోయినవారికి ఇండ్లు, వసతులు అతి తొందరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్తోపాటు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, తదితరులు ఉన్నారు.