end
=
Thursday, September 19, 2024
వార్తలుజాతీయంస్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
- Advertisment -

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

- Advertisment -
- Advertisment -

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఓ విషయాన్ని సూటిగా చెప్పేందుకు నేను కొత్త కొత్త పదాలను వెతకను. అందుకే నేను చాలా సరళంగా, సూటిగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

ఇద్దరూ.. ఇద్దరే: ఉత్తమ్‌కుమార్‌

ఇటీవల బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్మృతి ఇరానీ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. గత వారం ఆమె బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. గోపాల్‌గంజ్‌, ముంజర్‌, బోధ గయా, దిఘా వంటి ప్రాంతాల్లో దాదాపు 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్మృతికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి వారు కరోనా పరీక్షలు చేయించుకోవడంలో నిమగ్నమయ్యారు.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ నిశ్చితార్థం..!

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -