తనకు మట్టిని ముట్టుకోవడమంటే పరమ చిరాకని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన ఆర్ఆర్ఆర్ టీమ్, రాజమౌళి మొక్కలు నాటారు. అందులో భాగంగా ఆర్ఆర్ఆర్ బృందం.. ఆచార్య, రాధేశ్యామ్, పుష్ప సినీ బృందాలకు గ్రీన్ ఛాలెంజ్ చేసింది. అలాగే దర్శకుడు రాజమౌళి వ్యక్తిగతంగా వి. వి. వినాయక్, పూరీ జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మకు ఛాలెంజ్ చేశారు.
అందుకు స్పందించిన ఆర్జీవీ.. పచ్చదనానికి, సవాళ్లకు నేను దూరం అని చెప్పారు. మట్టిని ముట్టుకోవడమంటే నాకు అసహ్యం. నాకన్నా గొప్ప వ్యక్తి మొక్కలు నాటితే వాటికి గౌరవముంటుంది. కానీ, నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటకూడదన్నాడు. మీకు మీ మొక్కలకు మంచిజరగాలని వర్మ.. రాజమౌళికి బదులిచ్చాడు.