end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంవారెవ్వా.. ఆగస్త్యా..!
- Advertisment -

వారెవ్వా.. ఆగస్త్యా..!

- Advertisment -
- Advertisment -
  • 14 ఏళ్లకే డిగ్రీ

14 ఏళ్లకే డిగ్రీ పట్టా పొందాలంటే మామూలు విషయమా. ఇది అసాధ్యమని ఎవరైనా మూకుమ్మడిగా చెబుతారు. కానీ, ఈ అసాధ్యాన్ని సాధ్యం చేశాడు కాచిగూడకు చెందిన14 ఏళ్ల ఆగస్త్య జైస్వాల్‌. జాతీయస్థాయిలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు అగస్త్యా. యూసుఫ్‌గూడలోని సెయింట్‌ మేరీ కాలేజీలో బీఏ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేసిన ఈ జీనియస్‌ కుర్రాడు.. 11 ఏళ్లలో ఇంటర్‌ పూర్తి చేశాడు.

తెలంగాణ రాష్ట్రంలో 14 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసిన బాలుడిగా ఆగస్త్య జైస్వాల్‌ రికార్డు సృష్టించాడు. ఆగస్త్య జైస్వాల్‌ సోదరి నైనా జైస్వాల్‌ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు ఈ అక్కాతమ్ముళ్లు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం కాచిగూడలో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అశ్విన్‌కుమార్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అగస్త్య జైస్వాల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్‌ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో రాణించడం వెనుక మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. అక్క నైనా నాకు ఆదర్శం. స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులనే తన గురువులుగా చేసుకుని క్రీడా, విద్యా రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపాడు ఈ సూపర్‌ టాలెంటెడ్‌ గయ్‌.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -