end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంగుట్కా దందాపై పోలీసుల పంజా
- Advertisment -

గుట్కా దందాపై పోలీసుల పంజా

- Advertisment -
- Advertisment -
  • భారీగా అక్రమ గుట్కా స్వాధీనం

ప్రభుత్వం నిషేధించిన గుట్కా వ్యాపారంపై పట్టణ పోలీసులు తమదైన శైలిలో దాడులు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గుట్కా దందాపై పంజా విసిరారు. వేములవాడ పట్టణంలో నిషేధిత గుట్కా అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులపై ఇటు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు దాడులు నిర్వహించి వారిపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ప్రభుత్వ నిషేధ గుట్కా అమ్ముతున్నారనే పక్క సమాచారం మేరకు ఎస్సై గంగాధర్ సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించగా దాదాపు 1,90,000 రూపాయల విలువ గల పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వేములవాడ పట్టణ సిఐ వెంకటేష్ మాట్లాడుతూ.. అక్రమంగా నిషేధిత గుట్కా దందా నిర్వహించే వ్యక్తుల పై గట్టి నిఘా పెట్టామని పేర్కొన్నారు. నిందితులు బి.శీను, వెంకీ, జంపయ్య, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గుట్టుగా గుట్కా దందా సరఫరా చేస్తున్న వ్యక్తులపై నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -