గుజరాత్ రాజ్యసభ ఎంపీ(పార్లమెంట్ మెంబర్) అభయ్ భరద్వాజ్ ఈ రోజు కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకిన ఆయనను రాజ్కోట్లోని దీన్దయాల్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన శరీరంలోని పలు కీలక అవయవాలు సరిగ్గా పనిచేయక మృత్యువాత పడ్డారు. కాగా, భరద్వాజ్ మరణంపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశాభివృద్ధికై పాటుపడే నాయకుడిని కోల్పోవడం బాధాకరం. న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం. ఓం శాంతి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.