end
=
Thursday, September 19, 2024
వార్తలుజాతీయంవారి ప్రయత్నాలు తిప్పికొడతాం: రాజస్తాన్‌ సీఎం
- Advertisment -

వారి ప్రయత్నాలు తిప్పికొడతాం: రాజస్తాన్‌ సీఎం

- Advertisment -
- Advertisment -

జైపూర్: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆరోపించారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఏం చేయలేరని ఆయన ఫైర్‌ అయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లతో చర్చ అనంతరం తమ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారని, బీజేపీ కుయుక్తులను తనతో చెప్పి అమిత్ షాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. దేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలందించారని, అలాంటి పదవిలో ఉన్న అమిత్ షా.. ఆ పదవికి కలంకం తెస్తున్నారని గెహ్లాత్ మండిపడ్డారు.

వాళ్లు మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లతో మీటింగ్ ముగిసిన అనంతరం మా ఎమ్మెల్యేలు నన్ను కలిశారు. అమిత్ షా లాంటి వ్యక్తి దేశానికి హోంమంత్రిగా ఉండడం సిగ్గనిపించిందని వాళ్లు నాతో అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ పటేల్ ఈ దేశానికి మొట్టమొదటి హోంమంత్రి. ప్రస్తుతం ఆ పదవిలో అమిత్ షా ఉన్నారు’’ అని అశోక్ గెహ్లోత్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ వాళ్లు ఇప్పటికే ఐదు ప్రభుత్వాల్ని కూలదోశారు. ఇప్పుడు మా ప్రభుత్వంపై పడ్డారు. పాలన వదిలేసి బీజేపీ పనికిమాలిన కుట్రలు చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -