end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంభారత కరెన్సీపై అంబేడ్కర్‌ ఫోటో ముద్రించాలి
- Advertisment -

భారత కరెన్సీపై అంబేడ్కర్‌ ఫోటో ముద్రించాలి

- Advertisment -
- Advertisment -
  • అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్‌

హైదరాబాద్‌: ఇండియన్‌ కరెన్సీపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను ముద్రించాలని అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్‌ కోరారు. ఇండియన్‌ కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని కోరుతూ పరుశురామ్‌ నిర్వహిస్తున్న ప్రజాచైతన్య రథయాత్ర సోమవారం ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్‌ గాలి వినోద్‌కుమార్‌, వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు, భీమ్‌ ఆర్మీ వాసుకే యాదవ్‌, శివ, తెలంగాణ అమరుల సంఘం స్వేరో విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతం పలికారు.

లా కాలేజీలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలోని పలు కూడళ్లలో ప్రచారం చేపట్టిన తర్వాత ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సభ నిర్వహించారు. అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చింతల సునీల్‌ అధ్యక్షతన జరిగిన సభలో పరుశురామ్‌ మాట్లాడుతూ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ ఫొటోను ఇండియన్‌ కరెన్సీపై తప్పకుండా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్‌ గాలి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. స్వదేశీ ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధం, జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనతోపాటు దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ప్రాణ, ఆర్థిక నష్టం జరిగినప్పుడు, ఇంపిరీయల్‌ బ్యాంకు కుప్పకూలినప్పుడు ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకుని ‘రూపాయి సమస్య పరిష్కార మార్గం’ అనే పుస్తకాన్ని అంబేడ్కర్‌ 1926లో రాసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి అందజేసినట్లు గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయన రాసిన పుస్తకంతో రూపాయి అవసరాన్ని గుర్తించి 1935 ఏప్రిల్‌ 1న రిజర్వ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారన్నారు. అంబేడ్కర్‌ కారణంగానే ఆర్‌బీఐ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -