end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంరైతులకు మద్దతుగా చేవెళ్ల ఎమ్మెల్యే
- Advertisment -

రైతులకు మద్దతుగా చేవెళ్ల ఎమ్మెల్యే

- Advertisment -
- Advertisment -

రంగారెడ్డి: దేశవ్యాప్తంగా ఇవాళ భారత్‌బంద్‌ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని, రైతులకు తమ మద్దతు తెలియజేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకర్‌పల్లి మండలంలో రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. శంకర్‌పల్లి ప్రధాన కూడలిలో ఎమ్మెల్యే యాదయ్యతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి.

కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నాయకులు, రైతులు నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్యే యాదయ్య హెచ్చరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -