end
=
Friday, September 20, 2024
సినీమారవితేజ ఫ్యాన్స్‌కు సూపర్‌ న్యూస్‌
- Advertisment -

రవితేజ ఫ్యాన్స్‌కు సూపర్‌ న్యూస్‌

- Advertisment -
- Advertisment -

మాస్‌ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌. ఆయన హీరోగా తెరకెక్కిన ‘క్రాక్‌’ సినిమా సంక్రాంతి చిత్రంగా ఈ రోజు ఎర్లీ మార్నింగ్‌ షోతో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సమస్యల కారణంగా అది జరగలేదు. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, విడుదలవుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎటువంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. ఎర్లీ మార్నింగ్‌ షోతో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఎర్లీ మార్నింగ్‌ షో క్యాన్సిల్‌ చేసుకుని మార్నింగ్‌ షోకి విడుదల అన్నారు. ఆ తర్వాత మ్యాట్నీ షోతోవిడుదల అన్నారు. తీరా సినిమా ఫస్ట్‌ షోతో రిలీజ్‌ అవడంతో ప్రేక్షకులకు కాస్త ఉత్సాహం లభించిందని చెప్పవచ్చు.

నిర్మాత ఠాగూర్‌ మధు సినిమా రిలీజ్‌కి సంబంధించిన కొన్ని విషయాలను క్లియర్‌ చేయకపోవడం వల్లే ఈ సినిమా విడుదల వాయిదా పడిందనేలా వార్తలు వచ్చినా.. ఆ సమస్యలన్నీ తొలిగి ఎట్టకేలకు మూవీ రిలీజవడంతో రవితేజ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో తెగ ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌ముద్రఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్రల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వతి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -