end
=
Monday, September 23, 2024
సినీమా'ఆచార్య' రక్షోభవ..
- Advertisment -

‘ఆచార్య’ రక్షోభవ..

- Advertisment -
- Advertisment -
  • అదిరిపోయిన ఆచార్య టీజర్‌
  • చరణ్‌ వాయిస్‌ ఓవర్‌

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం (జనవరి 29) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు. అనే విషయం తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌.

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో.. ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. మరి అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’ అని మొదలవగా.. చివరిలో చిరంజీవి.. ‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకో ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో టీజర్‌ ముగిసింది. మెగాస్టార్‌ చిరంజీవి ధర్మస్థలిలో ధర్మ సంరక్షణార్థం ఆచార్యగా ఏం చేశాడనే విషయాలను యాక్షన్‌ ప్యాక్‌డ్‌గా ఆచార్య టీజర్‌లో చూపించారు. టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అనే స్లోగన్‌ వినిపిస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా మే 13న విడుదల అవుతుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -