- ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిపై కఠిన నిబంధనలు
- తెలంగాణ రాష్ర్ట హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
ప్రపంచమంతా కరోనాతో పడిన కష్టాలు మరిచిపోకముందే మళ్లీ కొత్త వైరస్ ఒమిక్రాన్ గురించి విని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ వైరస్ కేసుల నమొదయ్యాయి. ఇక భయంకరమైన విషయం ఏమిటంటే ఈ వేరియంట్ వైరస్కు ఇంకా టీకా కనుగొనలేదు.
ఇదిలావుంటే ఈ వైరస్ భారత్లో కూడా ప్రవేశించి భారత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మఖానికి మాస్కు, చేతులు శానిటైజేషన్ తప్పనిసరిగా నిబంధన విధించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో, ఆఫీసుల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. లేని పక్షంలో రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.