పేటీఎంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అంక్షలు విధించింది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది. పర్యవేక్షణ లోపాలు, ఐటీ వ్యవస్థ పనితీరుపై ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఐటీ వ్యవస్థ నిర్వహించేందుకు తక్షణమే ఆడిట్ సంస్థను నియమించుకోవాలని తెలిపింది.
మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష
బ్యాంకింగ్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బిఐ పేర్కొంది. ఐటీ ఆడిట్ అధికారులను నియమించుకొని వారు ఇచ్చిన ఆడిట్ నివేదక ఆధారంగా తదుపరి అనుమతులు ఇస్తామని ఆర్బిఐ పేర్కొంది. సాంకేతిక లోపాలు, ఆడిట్ వ్యవస్థ పటిష్టం అయ్యాకే ఆంక్షలు ఎత్తవేయనున్నట్లు తెలిపింది.