end
=
Friday, September 20, 2024
క్రీడలుఅదృశ్యమవుతున్న ఆటగాళ్లు..
- Advertisment -

అదృశ్యమవుతున్న ఆటగాళ్లు..

- Advertisment -
- Advertisment -

నిన్న లంక క్రీడాకారులు.. నేడు పాక్ బాక్సర్లు.. బర్మింగ్‌హామ్‌లోనే వరుసుగా అదృశ్యమవుతున్న ఆటగాళ్లు.. కామన్వెల్త్‌లో పాల్గొన్న ఇద్దరు పాక్‌ బాక్సర్లు కనిపించడం లేదు..కారణమేంటి? కామన్‌వెల్త్ గేమ్స్ ముగిసాయి. అన్ని దేశాల జట్లు తిరుగు పయనమయ్యాయి. అయితే ఇంతలోనే బర్మింగ్‌హమ్‌లో పిడుగులాంటి వార్త కలకలం రేపింది. తిరుగుపయనమైన పాకిస్తాన్ టీం నుంచి ఇద్దరు బాక్సర్లు మిస్సయ్యారు. వారు ఎక్కడ ఉన్నారో తెలియదు . పాకిస్తాన్ నుంచి వచ్చిన జట్టులో బాక్సర్లు నజీర్ ఉల్లా, సులేమాన్ బలోచ్‌లు మిస్సయినట్లు పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ తెలిపింది. వారిద్దరికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు తమ మేనేజ్‌మెంట్ దగ్గరే ఉన్నాయని వారు తెలిపారు. దీంతో మిస్సయిన బాక్సర్లకు సంబంధించి పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు కామన్‌వెల్త్ గేమ్స్ అథారిటీని కలిసి వారిని వెతికిపెట్టడంతో సహాయం చేయాలని అడిగారు.

దీనిపై యూకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కే రెండు గంటల ముందుగానే ఈ ఘటన జరగడం జరిగింది. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంకకు చెందిన సుమారు 10 మంది అథ్లెట్లు కూడా కనిపించకుండా పోయారు. ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం ఆలోచించాల్సిన విషయం . లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటార స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని కష్టపడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంక, పాకిస్తాన్‌ రెండు దేశాల్లో అదృష్యమైన ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -