end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంYS విజయమ్మకు తప్పిన ప్రమాదం..
- Advertisment -

YS విజయమ్మకు తప్పిన ప్రమాదం..

- Advertisment -
- Advertisment -

సీఎం జగన్ తల్లి విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పేలింది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలులో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు విజయమ్మ గురువారం అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విజయమ్మ కి ఏంకాలేదు. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు అయ్యప రెడ్డిని వైఎస్ విజయమ్మ గురువారం పరామర్శించారు.

అనంతపురం జిల్లాలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అదుపుతప్పిన కారును డ్రైవర్ అతి కష్టం మీద అదుపు చేశారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వైఎస్ విజయమ్మకు మరో కారు ఏర్పాటు చేశారు. దీంతో వైఎస్ విజయమ్మ అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లాలోని అయ్యప్పరెడ్డిని వైఎస్ విజయమ్మతో పాటు మరికొందరు నేతలు పరామర్శించారు. అయ్యప్పరెడ్డిని పరామర్శించిన అనంతరరం విజయమ్మ కారులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో గుత్తి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారును డ్రైవర్ చాకచక్యంగా అదుపుచేయడంతో వైఎస్ విజయమ్మ సహా కారులో ఉన్న మిగిలినవారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -