end

అమిత్‌షా పర్యటన… ట్రాఫిక్‌ ఆంక్షలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రామంతాపూర్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను అమిత్‌షా ఈ రోజు ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో కూడా అమిత్‌షా పర్యటించనున్నారు.

ఘోర అగ్ని ప్రమాదం… 27 మంది మృతి

మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటలకు వరకు తుక్కుగూడవైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఎల్‌బీనగర్‌, హాయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నుండి ఎయిర్‌ పోర్టుకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇదేగాకుండా ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ నెం.14లో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను అనుమతించబోమని పోలీసులు వివరించారు.

Exit mobile version