end

టీఆర్ఎస్ ఖాతాలో మరో విజయం

హైదరాబాద్: ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 55 డివిజన్లను గెలుచుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి గెలుపొందారు. దీంతో టీఆర్‌ఎస్ ఖాతాలో మరో డివిజన్ యాడ్ అయింది. కాగా, ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు బుధవారం ఉదయం నెరేడ్‌మెట్ 136 డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారే తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో కౌటింగ్ కాకుండా పెండింగ్‌లో ఉన్న 544 ఓట్లను లెక్కించారు. కాగా ఇప్పటికే 504 ఓట్లతో లీడ్‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8 గంటలకు 544 ఓట్లను లెక్కించగా.. 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి గెలుపొందినట్లు అధికారులు ప్రకిటించారు.

Exit mobile version