end

ఏపీ ఎంసెట్‌కు 2,69,832 దరఖాస్తులు!

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జూలై 27 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఏపీ ఎంసెట్-2020 పరీక్షలకు 2,69,832 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంసెట్ కన్వీనర్ వి.రవీంద్ర మంగళవారం తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో 1,83,140, అగ్రికల్చర్ మెడిసిన్ విభాగంలో 86,088 మంది, రెండు విభాగాలకు 604 మంది దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు రూ.500 ఫైన్‌తో జూన్ 30 వరకు దరఖాస్తుకు గడువు ఉందని తెలిపారు. పరీక్ష కేంద్రాల అప్షన్ల మార్పునకు 12,947 మంది విద్యార్థుల నుంచి వినతులు వచ్చినట్లు వెల్లడించారు.

Exit mobile version