end

నెల రోజుల ముందే బస్‌ టికెట్‌ బుకింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(APSRTC) ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు అడ్వాన్స్‌డ్‌ రిజ్వేషేన్‌ గడువు నెల రోజులకు పెంచింది. ఇకనుండి నెల రోజుల ముందుగా బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సదుపాయం శనివారం 22 నుండి అందుబాటులో ఉంటుందని ఏపిఎస్‌ఆర్టీసీ ఈడి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

(ఏఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపిన రౌడీషీటర్‌)

ఇప్పటి వరకు ఉన్న 7 రోజుల అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ గడువును 30 రోజులకు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణం చేయాలని ఆయన కోరారు.

Exit mobile version