end

ఆస్ట్రేలియా టార్గెట్‌ 162

కాన్‌బెర్రా: టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ కె ఎల్‌ రాహుల్‌(40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్సర్‌), జడేజా(23 బంతుల్లో 44; 5ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించారు. సామ్సన్‌(23), పాండ్యా(16పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ అంతా తేలిపోయారు. ధావన్‌, కెప్టెన్‌ కోహ్లి, పాండే మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బాల్స్‌కు భారత బ్యాట్స్‌మెన్‌ దగ్గర సమాధానమే లేకపోయింది. చివర్లో జడేజా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడబట్టి ఆ మాత్రం స్కోరైన చేయగలింది భారత్‌. ఆసీస్ బౌలర్లలో హెన్రిక్స్‌ 3, స్టార్క్‌ 2, జంపా, స్వెప్సన్‌ తలా ఓ వికెట్ తీశారు.

Exit mobile version