end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంఅంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ
- Advertisment -

అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

- Advertisment -
- Advertisment -

దౌల్తాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్టాపనకు శేరుపల్లిలో భూమిపూజ జరిగింది. ఆయన ఆలోచనా విధానాలే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభ్యున్నతికి బంగారు బాటలు అని దౌల్తాబాద్ మండల ఎంపీపీ గంగాధరి సంధ్యారవీందర్, తెలంగాణ దళిత సంఘాల ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు ఎగ్గడ్డి శేఖర్, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండి స్వామి అన్నారు. సోమవారం మండలంలోని శేరుపల్లి గ్రామంలో అంబేడ్కర్‌ సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు లింగం, ఉపాధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి కుమార స్వామి, యూత్ సభ్యులు మహేష్, బాలు, వెంకటేష్, శ్రీకాంత్, ప్రశాంత్, ఐకాస చేగుంట మండల ఉపాధ్యక్షులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -