end
=
Thursday, September 19, 2024
క్రీడలుముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌
- Advertisment -

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌

- Advertisment -
- Advertisment -
  • సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌ 2022 తొలి మ్యాచ్‌కు దూరం !

ఐపీఎల్‌ 2022 ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 3 30 గంటలకు తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటెల్స్‌తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో టీ20 సిరిస్‌కు ముందు సూర్యకుమార్‌ చేయి ఫ్రాక్చర్‌ అయింది. ఆయన బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడిమీలో చికిత్సపొందాడు. చేయి ఫ్రాక్చర్‌ నయం అయినప్పటికీ ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. అందువల్ల సూర్యకుమార్‌ ముంబై ఇండియన్‌ టీమ్‌కు ఐపీఎల్‌ 2022 తొలిమ్యాచ్‌ ఆడలేకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముంబై జట్టులో ఎవరెవరు ఉన్నారు?

రోహిత్ శర్మ (కెప్టెన్‌), మయాంక్ మార్కండే, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, బాసిల్ థంపి, అన్మోల్‌ప్రీత్ సింగ్, జయదేవ్ ఉదద్కట్, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, తైమల్ మిల్స్, డేవిడ్, అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, ఫాబియన్ అలెన్, ఆర్యన్ జుయల్ ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -