end
=
Saturday, April 12, 2025
వార్తలుజాతీయంఅన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామ‌న్నఅమిత్‌షా..
- Advertisment -

అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామ‌న్నఅమిత్‌షా..

- Advertisment -
- Advertisment -

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026లో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో (Assembly Elections) అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే, పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమిత్ షా(Amith Sha_) తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలైతో కలిసి అమిత్ షా చెనైలో శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ అన్నాడీఎంకే చేరికతో ఎన్డీయే కూటమి(NDA alliance) మరింత బలోపేతమయిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని వెల్లడించారు. అలాగే, ఎన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమన్నారు. సీట్ల కేటాయింపుపై తర్వాత చర్చిస్తామని షా స్పష్టం చేశారు. తమిళ భాష, ప్రజలు, సంస్కృతిని బీజేపీ గౌరవిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడటంతోపాటు తమిళుల ప్రయోజనాలను విస్మరించిందని ఆరోపించారు. తమిళ మాద్యమంలో ప్రొఫెషనల్ కోర్సులను డీఎంకే ప్రభుత్వం అనుమతించట్లేదని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం ఉన్న ప్రతిచోటా మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సుల సిలబస్‌ను మాతృభాషలో అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. తమిళ భాషకు స్టాలిన్ ఏం చేశారో చెప్పగలరా అని ఈ సందర్భంగా షా ప్రశ్నించారు. సనాతన ధర్మం, త్రిభాషా విధానం, నీట్, డీలిమిటేషన్ (De Limitation) వంటి అంశాలతో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. అలాగే, డీఎంకే ప్రభుత్వం లిక్కర్ పాలసీ, ఉపాధి హామీ పథకాల్లో కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణాలపై సీఎం స్టాలిన్, ఉధయనిది సమాధానం చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ నామినేషన్ దాఖలు చేశారు. తిరునల్వేలి అసెంబ్లీస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన టి. నగర్‌లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -