end

ప్రశాంత్‌ కిషోర్‌కు బీజేపీ కౌంటర్‌

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదన్న అతని మాటలకు కౌంటర్‌ ఇచ్చింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక దేశంలో ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందని ఎద్దేవా చేసింది. ఎన్నికల్లో డబుల్ డిజిట్ దాటితే తాను ట్విటర్‌‌ నుంచి తప్పుకుంటానంటూ ట్వీట్ చేశాడు. పీకే ట్వీట్ వైరల్ కావడంతో మీడియా దీన్ని పెద్ద ఎత్తున కవర్ చేసింది.

దీంతో బీజేపీ ప్రశాంత్ కిశోర్‌కు కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారం చేపట్టాక దేశంలో ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందని పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ కైలాస్ విజయ వర్గీయ ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం బీజేపీ సునామీ కొనసాగుతోందని 200 సీట్లకు మించి స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనం బీజేపీ వెంటే ఉన్నారనేది అమిత్ షా పర్యటనలో సుస్పష్టమైందని ఆయన చెప్పారు.

Exit mobile version