end
=
Sunday, July 7, 2024
వార్తలుజాతీయంఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ హవా
- Advertisment -

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

- Advertisment -
- Advertisment -
  • సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజెపీ దూసుకెళ్తుంది. ఇప్పటికే 67 స్థానాలు కైవసం చేసున్నకున్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ర్ట బిజెపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌ ప్రకటించారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఇదే ఉత్సాహంతో బీజెపీ ముందుకు సాగుతుందని దేవ్‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజెపీ హవా కొనసాగుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి…

మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది చైర్‌పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందే 21 చోట్ల బీజేపీ మద్దతుదారులు, ఎస్పీకి చెందిన ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు శనివారం ఉదయం ఓటింగ్‌ నిర్వహించి అనంతరం ఫలితాలు వెల్లడించారు. పార్టీ గుర్తులు లేకుండా ఈ ఎన్నికలు జరిగాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -