end
=
Friday, September 20, 2024
క్రీడలుబౌలింగ్‌ ఎంచుకున్న ఇండియా
- Advertisment -

బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియా

- Advertisment -
- Advertisment -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తలపడనున్న రెండో టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. కాగా, మొదటి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి, సిరీస్‌ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. వన్డే సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియా జట్టు కసి మీదుంది.

మరోవైపు తొలిమ్యాచ్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ముఖ్యంగా‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు మ్యాథ్యూ వేడ్‌ కెప్టెన్సీ వహించనున్నాడు. కాగా, భారత్‌ కూడా అన్ని విభాగాల్లోనూ సమతూకంగా ఉంది. కెప్టెన్‌ కోహ్లి రాణిస్తే ఆసీస్‌కు తిప్పలు తప్పవు.
జట్లు:
ఇండియా: రాహుల్(వికెట్ కీపర్‌)‌, శిఖర్ ధావన్‌, విరాట్ కోహ్లి(కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, సంజూ సాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్‌
ఆస్ట్రేలియా: ఆర్సీ షార్ట్‌, స్టోయినిస్, స్టీవెన్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, మ్యాథ్యూ వేడ్‌, డానియెల్‌ సామ్స్‌, మిచెల్‌ స్వెప్సన్‌, ఆడమ్‌ జంపా, ఆండ్రూ టై.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -