end

Bus Accident : తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా

bus overturned in tirumala

Tirumala : తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో(Bus Accident) ఇద్దరు ప్రయాణీకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మొదటి ఘాట్‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అలిపిరి(Alipiri RTC) డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు 28వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదానికి గురైన ప్రయాణీకులను తిరుపతి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తిరుమలలో విధుల అనంతరం తిరుపతికి ప్రయాణమైన ఆర్‌పిఎఫ్‌ (RPF Constable) కానిస్టేబుల్‌ ప్రమాదాన్ని పసిగట్టి బస్సు అద్దాలను పగులకొట్టి (Glass Break) బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు పేర్కొన్నారు.



ఇవి కూడా చదవండి

Exit mobile version