end

డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టిన కారు ; ఇద్దరు మృతి

జాతీయ రహదారి 65పై కారు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆపివున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అభి(౩౦), రేణుక(28) అక్కడే మృత్యువాత పడ్డారు. మరో వ్యక్తి కృష్ణకు తీవ్రంగా గాయాలయ్యాయి.

హైదరాబాద్‌ నుండి విజయవాడ వెళ్తూ ఈ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కట్టంగూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ కృష్ణను నార్కెట్‌పల్లిలోని కామినెని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు అవగాహన ప్రకారం… అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

(చాలా దారుణం – ఒకే కుటుంబంలో నలుగురు మృతి)

Exit mobile version