end

క్లాట్‌-2020 ప్రవేశ పరీక్ష వాయిదా

  • పశ్చిబెంగాల్‌, బీహార్‌లలో లాక్‌డౌన్‌నే కారణం

కరోనా వైరస్‌ కారణంగా క్లాట్‌-2020 ప్రవేశ పరీక్ష మరోసారి వాయిదాపడింది. దేశంలో న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్‌ పరీక్ష షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 7న జరగాల్సి ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అదే రోజు పశ్చిమబెంగాల్‌లో పూర్తిగా లాక్‌డౌన్‌ చేపడుతున్నట్లు బెంగాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. అదేగాకుండా బీహార్‌లో కూడా సెప్టెంబర్‌ 6న లాక్‌డౌన్‌ చేపట్టబోతున్నారు. కావున ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం కన్సార్సిషియం ఆఫ్‌ లా యూనివర్సిటీస్‌ పరీక్షను సెప్టెంబర్‌ 28కి వాయిదా వేసింది.

కరీంనగర్‌ విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

ఈ క్లాట్‌ పరీక్ష కోసం 73 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు 3500 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా క్లాట్‌ పరీక్షను సెప్టెంబర్‌ 28కి వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version