- మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ఫోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం ఘటన జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని వైద్య అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
