end

పార్టీ ప్రముఖులతో రేపు సీఎం సమావేశం

జీహెచ్‌ఎంసీ నోటిఫికేషన్‌ వెలువడడంతో ఆయా పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం తెలంగాణ భవన్‌లో జరగనుంది. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై ప్రధాన చర్చ జరగనున్నట్లు సమాచారం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపు తమదంటే తమదని బీరాలు పోతున్నాయి. టీఆర్ఎస్‌ పార్టీ మాత్రం వందకు పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ప్రచారంలో పాల్గొని, పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

Exit mobile version