- హైదరాబాద్లో కానిస్టేబుల్ మృతి
హైదరాబాదులో పోలీస్ కానిస్టేబుల్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మహంకాళి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. రాణిగంజ్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మధు బ్యాంక్ ఆఫ్ మహారాష్ర్ట కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ గన్తో కాల్చుకొని అకస్మాత్తుగా కూలిపోయాడు. ఇతను నల్లగొండ జిల్లా వాసిగా పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్యగా దృవీకరించడం లేదు. బ్యాంకు మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Also Read below…
- రెండు బైకులు ఢీ; ముగ్గురు మృతి
- లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, కానిస్టేబుల్
- తాళికట్టనివ్వని నవ వధువు
- లాక్డౌన్ దిశగా యూరప్ దేశాలు
- కరోనా వైరస్తో మంత్రి మృతి