end
=
Thursday, September 19, 2024
వార్తలుజాతీయందేశంలో పెరగుగుతున్న కరోనా కేసులు
- Advertisment -

దేశంలో పెరగుగుతున్న కరోనా కేసులు

- Advertisment -
- Advertisment -

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రెండో రోజు కూడా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా 8,582 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం దేశంలో కేసులు 4,32,22,017కు చేరుకున్నాయి. అయితే ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అవగా, 5,24,761 మంది మరణించారు. గత 24 గంటల్లో వైరస్‌ బారిన పడి మరణించారు. 4,435 మంది బాధితులు వైరస్‌నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా యాక్టివ్‌ కేసులు 0.10 శాతానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది . రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,07,08,541 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -