Corona:ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా టెస్ట్ చేసినప్పుడు కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలుతున్నది. అలాంటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా బారిన పడకుండా ఉంటారు. ఒకవేళ కరోనా సోకినా దాన్ని ఓడించొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామంది కరోనా బారిన పడిన తర్వాత కొన్నిరోజులకు కోలుకుంటున్నారు కారణం వంటింటి చిట్కాలే. అందులో ముఖ్యమైనది ఆవిరి చికిత్సే(Steam treatment). దీని మీద ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్(Seven Hills Hospital) వైద్యులు మూడు నెలలపాటు అధ్యయనం చేసిన తర్వత ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా సోకిన వారికి రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టించడం ద్వారా వారు త్వరగా కోలుకున్నట్లు(recovery) తేలింది. ఈ పరిశోధన(Reserche) కోసం 105 మందిని తీసుకున్నారు. వీరిని రెండు భాగాలు డివైడ్ చేశారు. కరోనా లక్షణాలు కనిపించని వారికి రోజుకు మూడుసార్లు ఆవిరి చికిత్స చేయడంతో మూడు రోజుల్లోనే కోలుకున్నారు. లక్షణాలు కనిపించే వారిలో మూడు గంటలకు ఒకసారి 5 నిమిషాలపాటు ఆవిరి పట్టుకుంటే వారంలో కోలుకున్నట్లు వెల్లడైంది. అంత ప్రత్యేకత(Special) ఉంది ఈ ఆవిరికి. అయితే ఈ ఆవిరిలో క్యాప్సూల్స్, విక్స్, అల్లం, పసుపు వంటి ఇంగ్రీడియంట్స్ను స్టీమ్ థెరపీ(Steam therapy)లో ఉపయోగించాలి.
(Weight Loss: రెండు వారాల్లో 10 కిలోల బరువు తగ్గొచ్చు)