end

తండ్రిని చంపిన కొడుకు..

  • సాయం చేసిన తల్లి..
  • మంటకలిసిన మానవత్వం

రంగారెడ్డి  :  బంధాలు, బంధుత్వాలు మాయమైపోతున్నాయి. మనుషులు మరీ కఠినాత్మకంగా తయారవుతున్నారు. సొంతవాళ్లను కూడా చంపేందుకు వెనకాడం లేదు. తాజాగా చేవెళ్ల మండలంలోని‌ గుండాల గ్రామంలో కన్నకొడుకే తండ్రిని కిరాతకంగా అంత మొందించాడు. ఈ దారుణానికి తల్లే సహకరించింది. నెలరోజులుగా కిష్టయ్య అనే వ్యక్తి  కనిపించకపోవడంతో బంధువులు అతడి కొడుకుని గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం…

తల్లి సహాయంతో తండ్రిని చంపేశానని, తమ పొలంలోనే పాతిపెట్టినట్లు కొడుకు అంగీకరించాడు. మృతదేహం బయటికి తీయించిన పోలీసులు, పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version