end

చాలా దారుణం – ఒకే కుటుంబంలో నలుగురు మృతి

చాలా దారుణమైన పరిస్థితి. ఒకే కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయి విగతజీవులుగా పడిఉన్నారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో జరిగింది.

ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఆజీరాం బీ (63), కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజాపాష (42), మనుమరాలు హసీన (10) ఇంట్లో వేర్వేరుచోట్ల విగతజీవులై పడి ఉన్నారు. వంటగదిలో ఆజీరాం బీ మృతదేహాన్ని, డైనింగ్‌ హాల్‌లో ఆస్మా బేగం మృతదేహాన్ని, ఇంటి వెనుక గుంతలో ఖాజాపాష మృతదేహాన్ని, హాల్‌లో హసీనా మృతదేహాలను గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇంట్లో క్షుద్ర పూజలు చేసినట్లుగా గుర్తించారు. ఏదేమైనా మూఢ నమ్మకాల మత్తులో ఇంకా కొన్ని గ్రామాలు మునిగితెలుతున్నాయి. మనుషులను మనిషే చంపడం ఎంత పాపం, ఎంత దారుణం.

(డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టిన కారు ; ఇద్దరు మృతి)

Exit mobile version