end

డీసీఎం – అటో ఢీ : నలుగురు మృతి

డిసిఎం అటో ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందిన సంఘటన ములుగు మండలం ఎర్రిగట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ధాటికి అటో నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ, అటో డ్రైవర్‌ ఉన్నారు.

ఈ దుర్ఘన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన అజయ్‌ (12), కిరణ్‌ (16), కౌసల్య (60), డ్రైవర్‌ జానీ (23) , వెన్నెల, రసూల్‌ గా గుర్తించారు. పల్లె బోయిన పద్మ, రసూల్, వెన్నెల, వసంత తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వీరంతా అన్నారం షరీఫ్‌ దర్గాకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Exit mobile version