end

డీసీఎం వ్యాన్‌ కారు ఢీ…

  • రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం
  • డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కొని గంటపాటు నరకయాతన
  • నలుగురికి తీవ్ర గాయాలు

కారు డీసీఎం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో జరిగింది. యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న కారు, అలాగే యాదగిరిగుట్ట నుండి చిట్యాల వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, డీసీఎం వ్యాన్‌లో ఉన్న డ్రైవర్‌, క్లీనర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. (తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి)

డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ క్యాబిన్‌లో చాలా సేపు ఇరుక్కొని నరకం అనుభవించాడు. కాగా క్లీనర్‌ ఈ ప్రమాదం నుండి బయటపడ్డాడు. జెసీబి సహాయంతో డీసీఎం నుండి డ్రైవర్‌ను కాపాడారు. గాయపడిన వారిని పోలీసులు నార్కట్‌మిల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. (‘ఇనుప పెట్టెలో బంగారం’)

Exit mobile version