- పార్టీలోకి ఆహ్వానించిన వైసీసీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
తెలుగుదేశం పార్టీ నాయకుడు, యలమంచిలి, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు టీడీపీకి గుడ్బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి రమేష్బాబును వైసిపిలోకి ఆహ్వానించారు.
(కళాశాల, వర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందే !)

తాడేపల్లిలోని వైసిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమేష్బాబు వైసీపీలో చేరారు. అభివృద్ధి వికేంద్రీకరణపై తెలుగుదేశం పార్టీ మీద విరక్తి, విసుగుతో రమేష్బాబు టీడీపీనీ వీడినట్లు చెప్పారు. రాజధానుల అంశంపై కూడా టీడీపీ వైఖరితో విభేదించినట్లు రమేష్ వివరించారు.