end

భారీ వర్షాలకు కుంగిన రైల్వేట్రాక్‌

జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాదులోని ఫలక్‌నుమా వద్ద రైల్వేట్రాక్‌ కింద భూమి కుంగిపోయి దాదాపు 8 మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడింది. ఈ దృశ్యాన్ని గమనించిన, అక్కడే గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోం గార్డు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలోనే గూడ్స్‌ రైలు ఆ ట్రాక్‌ మీద నుండి రావాల్సి ఉంది. కానీ ఈ సంఘటన తెలియడంతో గూడ్స్‌ రైలును ఆపేశారు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్యాసింజర్‌ రైలు కూడా రాకపోవడం చాలా మంచిదైంది. లేకపోతే చాలా పెద్ద ప్రాణనష్టం వాటిల్లేది.

Exit mobile version