end
=
Friday, September 20, 2024
క్రీడలునేడు ప్లే ఆఫ్ బెర్త్‌ పోరు..
- Advertisment -

నేడు ప్లే ఆఫ్ బెర్త్‌ పోరు..

- Advertisment -
- Advertisment -

-టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై

ఐపీఎల్‌లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. ప్లే ఆఫ్‌కు వెళ్లే మొదటి జట్టేదో ఖరారు కానుంది. పాయింట్ల పట్టికలో టాప్‌- 2లో ఉన్న ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు అబుదాబి వేదికగా తలపడనున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలా 11 మ్యాచులాడి, ఏడేసి విజయాలతో 14 పాయింట్లతో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ముంబై తొలి స్థానంలో ఉంది. కాగా, ఇవాళ ఏ జట్టు విజయం సాధించినా.. ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

టాస్‌ గెలిచిన ముంబై జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు సూపర్‌గా ఆడాయి. జట్ల బలాబలాలు చూస్తే, రెండు కూడా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాయి. కాగా, ఇరు జట్లు తామాడిన గత మ్యాచ్‌లో ఓడిపోయాయి. ఈ మ్యాచ్‌ గెలిచి, ఎలాగైనా ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయం చేసుకోవాలని ఇరుజట్లు తహతహలాడుతున్నాయి. గత రెండు మ్యాచులుగా ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడడం లేదు. అతడికి తొడ కండరాలు పట్టేయడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. పొలార్డ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, రోహిత్ లేకపోవడం ముంబైకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -