end

ఆరోగ్యం దెబ్బ తింటే తిరిగి పొందలేము

డాక్టర్ సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో డయాబెటిక్, ఎండో క్రైనాలజి రీసెర్చ్ అప్డేట్ -2022 పేరిట నిర్వహిస్తున్న ఈ సదస్సు నుండి ఎన్నో అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు, ఒకరి నుండి మరొకరు అనుభవాలు పంచుకునే ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమావేశాల వల్ల చికిత్సలో వస్తున్న నూతన మార్పులు, టెక్నాలజీలు తెలుసుకోవడం జరుగుతుంది.బీపీ, షుగర్ తో ఎంతో మంది బాధ పడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల వల్ల ఈ మార్పు వచ్చింది. చికిత్సల విధానంలో రోజు రోజుకి అనేక మార్పులు వస్తున్నాయి. అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ ఫలితాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటూ ఉంటే ప్రజలకు అధునాతనమైన వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుంది.

మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు కారణంగా చిన్న వయస్సులోనే రోగాలు వస్తున్నాయి. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యునికబుల్ డిసీజ్ క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని నియంత్రించేలా సీఎం కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఉన్న మూడంచెల అరోగ్య వ్యవస్థను, 5 అంచెల వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యను 33 కి పెంచుకుంటున్నాము. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నది. ఎంబీబీఎస్, పీజీ సీట్లను పెద్ద సంఖ్యలో పెంచుతున్నాం. చైనా, ఉక్రెయిన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వైద్య విద్య చదివేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దేశంలో పెద్ద మొత్తంలో (అసంక్రమిక వ్యాధులు)ఎన్ సి డీ స్క్రీనింగ్ చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇప్పటివరకు 1.34 కోట్ల మందికి స్క్రీనింగ్ పూర్తి చేసి,దాదాపు 6 లక్షల షుగర్ పేషెంట్లను గుర్తించి చికిత్స అందించడం జరుగుతున్నది. ప్రజల్లో అవగాహన కార్య్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు అవసరమైన మందులు అందిస్తున్నాం.

బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధుల నివారణలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నది. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఎర్లీ స్క్రీనింగ్, ఎర్లీ ట్రీటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నది. బీపీ, షుగర్ నియంత్రణ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. బిపి షుగర్ వంటివి గుర్తించి ఇంటికి వెళ్లి మందులు పంపిణీ చేసే కార్యక్రమం ఇది. ప్రభుత్వమే పూర్తి ఉచితంగా మందుల కిట్స్ ఇస్తున్నది. ఏ మందులు ఎప్పుడు ఎలా వేసుకోవాలో ఆ కిట్ లో స్పష్టంగా రాసి ఉంటుంది. మందులు ఇచ్చినా కొందరు అవగాహన లేక మందులు వాడటం లేదు. మేము గుర్తించాము. ఇలాంటిది జరగకుండా మా ఆశా కార్యకర్తలు చూస్తారు. రోగులకు కౌన్సిలింగ్ ఇచ్చి క్రమం తప్పకుండా మందులు వాడేలా చూస్తారు.33 జిల్లాల్లో టి డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. 259 బస్తీ దావాఖనల ద్వారా పట్టణాల్లో ప్రజలకి వైద్యం చేరువైంది. వీటి సంఖ్య ను త్వరలో 390 కి పెంచుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్నాయి. ఇలా ప్రభుత్వం అనేక రకాలుగా ఎన్ సి డీ వ్యాధులను గుర్తించి నియంత్రించే కార్యక్రమం అమలు చేస్తున్నది.

ములుగు, సిరిసిల్ల లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ను ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలో రాష్ట్రం అంతటా సీఎం కేసీఆర్ గారు విస్తరించనున్నారు. ఆరోగ్యం దెబ్బ తింటే తిరిగి పొందలేము. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలి. బీపీ, షుగర్ వంటి వ్యాధులను త్వరగా గుర్తించి, మందులు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే చాప కింద నీరు లా విస్తరించి ఆరోగ్యాన్ని క్షీనింప చేస్తాయి. మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎంతో ముఖ్యం. మారిన జీవన విధానం మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నది. వ్యాయామం, నడక వంటివి అలవాటు చేసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ పరిమితి లోగా ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు తగ్గించుకోవాలి. ఏటా కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి. మందులు వాడాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలను జాగృతం చేయడంలో అరోగ్య సదస్సులు ఎంతో ఉపయోగ పడుతాయి. మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుతున్నాను. జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయడమే కాకుండా, రాకుండా ఉండేలా చేసే అవగాహన కార్యక్రమాలు, ఉచిత పరీక్షల నిర్వహణ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం తరుపున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.

Exit mobile version